MLA క్యాంపు కార్యాలయం... జిల్లా పరిషత్ ఎదురుగా..నుండి,
నేడు నలగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు
గారితో కలిసి....
తమ క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన, రైస్ మిల్లర్ల సమావేశంలో జిల్లా ఉన్నతాధికాలతో కలిసి.. దాన్ని కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు..
రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యం కొన్ని రైస్ మిల్లుల యజమానులు, అనవసర పేచీలు పెడుతుండటంతో.. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సూచించారు, రైస్ మిల్లులకు ఏ ఇబ్బంది వచ్చినా తాను వారికి అండగా ఉంటానని రైతులను మాత్రం ఎలాంటి ఇబ్బందుల గురి చేయకుండ మిల్లర్లు సహకరించాలని కోరారు.. వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కాంటాలు పెట్టించి మిల్లర్లకు పంపాలని ఆదేశించారు. ఇందుకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు, అదనంగా లారీలు పెట్టి వెంటనే కళ్లాల నుండి, ధాన్యాన్ని, తరలించాలని ఆదేశించారు.
డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లు పిడి డిఆర్డిఓ కాళిందిని, డిఎం నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ శ్రీనివాస్.. రైస్ మిల్లర్లు, కందుకూరు మహేందర్, కొండ లక్ష్మయ్య, భద్రాద్రి రాములు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.