తుది దశకు అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు నిర్మాణం పనులు పరిశీలించిన మంత్రి కొప్పుల



తుది దశకు అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు


నిర్మాణం పనులు పరిశీలించిన మంత్రి కొప్పుల




మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి



========


హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న 

దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ సమీపంలో 

11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ కట్టడాలు, 

అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను ఆది వారం నాడు రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.

ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం కు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేశామని అధికారులు మంత్రి కి వివరించారు. విగ్రహం చుట్టూ ఎలివేషన్, స్మృతివనం, సెంట్రల్‌ లైబ్రరీ, ఫౌంటెన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.మార్చి చివరి నాటికి నిర్మాణం పనులు పూర్తి అవుతాయాని చెప్పారు.

విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేస్తున్న్నారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతోపాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తున్నారు. 125 అడుగుల ఎత్తు...45.5 ఫిట్ల  వెడల్పులో విగ్రహం ఉంటుంది..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాదు చేతల్లో తమ ప్రభుత్వం చూపుతుందన్నారు  మంత్రి కొప్పుల ఈశ్వర్.

ఈ ప్రాంతం సుందరంగా తీర్చి దిద్దే విధంగా అంబేద్కర్ విగ్రహ పనులు సాగుతున్నాయని,

ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు.

=======

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...