నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు...
కనగల్ మండలంలో రేగట్ట గ్రామప్రాంత రైతులు, సాగునీటి కొరకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని, స్థానిక ప్రజా ప్రతినిధులు కంచర్ల దృష్టికి తీసుకొనిరాగా , సమస్య పరిష్కారం కోసం సాగు నీటి శాఖ అధికారులతో కలసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు..
ఇందు కొరకు తాళ్ల బాయి గూడెం చెక్ డాం నుండి ఫీడర్ ఛానల్ ద్వారా జిల్లాయిపేట చెరువు నింపినట్లైతే.... రేగట్ట గ్రామ రైతులకు నీటి వనరులు అందుతాయని అధికారులు తెలియజేశారు.
ఇందుకోసం అవసరమగు నిధుల కోసం
ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
కనగల్ ఎంపీపీ కరీం పాషా జెడ్పిటిసి చెట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్లు, వంగాల సహా దేవ రెడ్డి దోటి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య,రేగట్ట సర్పంచ్ కడారి కృష్ణయ్య,ఎర్రబెల్లి నర్సిరెడ్డి, తదితరులు వెంట ఉన్నారు