మహబూబాబాద్ : రిటైర్డ్ కానిస్టేబుల్ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్ ఆడిట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్గా పనిచేస్తున్న జాటోత్ కిశోర్కుమార్ రూ. 18వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సివిల్ కానిస్టేబుల్ పెన్షన్ డబ్బుల కోసం ఆడిట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అసిస్టెంట్ ఆడిటర్ జే. శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ జాటోత్ కిశోర్కుమార్ అనే అధికారులు బాధితుడి నుంచి రూ. 25వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం డబ్బులతో వచ్చిన బాధితుడు ఫోన్ చేయగా తాను అందుబాటులో లేనని ఆ డబ్బులను సీనియర్ అసిస్టెంట్ కు ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సూచించాడు. దీంతో ఆయన సూచన మేరకు సీనియర్ అధికారి కిశోర్కుమార్కు రూ. 18వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...