పై ఫోటోలో.. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారితో మాట్లాడుతు..వీల్ చైర్ పై ఉన్న వ్యక్తినీ మీరు గుర్తించకపోవచ్చు...పేరు చెప్తే మీరు గుర్తుకు రావచ్చు...
అతనే అంశాలస్వామి
...
నాడు తీవ్ర దుర్భిక్షంతో.. ఎక్కడో పాథాళ లోకంలో ఉన్న ఫ్లోరిన్ నీరు తాగి... కాళ్లు చేతులు వంకర్లు పోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్న మునుగోడు వాసుల కష్టాలను నాటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజపేయి గారి ఎదురుగా టేబుల్ పై పడుకోబెట్టి..
వారి దీనస్థితిని తెలియజేసిన దుశర్ల సత్యనారాయణ, మీకు గుర్తే ఉంటుంది..
అదిగో అదే,అంశాల స్వామి వారి స్వగ్రామం శివన్న గూడెం గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కంచర్ల వస్తున్నారని తెలుసుకొని.. వారికి ఎదురేగి స్వాగతం పలికారు.. గతంలో ఫ్లోరిన్ నీటి తో తమ బతుకులు చిత్రమైపోయాయని.. మా ఊరికి,మా ప్రాంతానికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాకపోయేవారని...
కాని,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. మిషన్ భగీరథ తో ఇంటింటికి కృష్ణ నీరు అందించిన కేసీఆర్ మాకు దేవుడయ్యాడని.. ఇక్కడి వారికి మహనీయుడైనాడని.. ఈ ప్రాంత ప్రజల వారికి ఎప్పుడూ రుణపడి ఉంటారని కంచర్ల తో.. అన్నారు..
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బా గోని రమేష్ తదితరులు వెంట ఉన్నారు