ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష..*
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ. పి.యస్*
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రిలిమినరి రాత పరీక్ష నేడు ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరిగిందనీ జిల్లా యస్.పి గారూ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 110 పరీక్షా కేంద్రాలు నిర్వహించగా ఇందులో నల్లగొండ పట్టణములో 62 పరీక్షా కేంద్రాలు నకిరేకల్ పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు మరియు మిర్యాలగూడ పట్టణంలో 37 పరీక్షా కేంద్రాలను నిర్వహించడం జరిగిందనీ, మొత్తం 33327 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావలసి ఉండగా 31075 మంది హాజరయ్యారు. 2252 మంది గైహాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు