తేదీ 22-02-2022 రోజునా సహాయ సంచాలకులు (AD) వ్యవసాయ శాఖ నల్గొండ డివిజన్ పరిధి లోగల PIO, APIO లకు సమాచార హక్కు చట్టం -2005
పై"" అవగహన సదస్సు"" నిర్వహించడం జరుగింది. సమాచార హక్కు చట్టం ప్రకారంగా సమాచారం కోరిన వారికి సమాచారం ఇచ్చే విధానం, చట్టం లో సెక్షన్ లు, అప్పీళ్లు, గడువు తేదీలు, రుసుములు వివరాలు,తనిఖీ విధానం, రుసుములు మినహాయింపులు, కొన్ని ఉదాహరణలు .. సదస్సులో తెలియజెయ్యడం జరిగింది. అనంతరం సందేహాలను నివృత్తి చెయ్యడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ సదస్సును నల్గొండ జిల్లా RTI మానిటరింగ్ సభ్యులు డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి ADA కార్యాలయంలో నిర్వహించారు. RTI ACT పై అవగహన పెంచడానికి , చట్టం సమర్ధ వంతంగా అమలు చేయాలని, గడువు లోపు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఈ సదస్సులో ADకార్యాలయం APIO సంధ్య, కనగల్, తిప్పర్తి మండల వ్యవసాయ అధికారులు, అమరెందర్, సన్నీ రాజ్, వ్యవసాయ విస్తరణ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. . ఉత్తమ సందేహాలు అడిగిన వారికి RTI బుక్ లెట్ ను బహుమతిగా ఇవ్వడం జరిగింది