.*గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి నిబద్ధతతో పని చేయాలి : డిఐజి రంగనాధ్* - 

 .*గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి నిబద్ధతతో పని చేయాలి : డిఐజి రంగనాధ్* - - సమర్ధవంతంగా పనిచేసే అధికారులకు పదోన్నతులు, మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు - - నిర్వీర్యమవుతున్న యువతను కాపాడాల్సిన బాధ్యత మనదే - - సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సూచన నల్లగొండ : గంజాయి కారణంగా నిర్వీర్యమవుతున్న యువతను కాపాడడంతో పాటు *నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లా* గా మార్చడం లక్ష్యంగా అన్ని స్థాయిలో పోలీస్ అధికారులు నిబద్ధతతో పని చేయాలని డిఐజి రంగనాధ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై చాలా సీరియస్ గా ఉన్నదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గంజాయి కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నదని, దీనివల్ల దేశ అభివృద్ధి, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని చెప్పారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువత సైతం గంజాయి సేవించే స్థాయికి గంజాయి విక్రయాలు పెరిగాయని అందువల్ల క్షేత్రస్థాయి నుండి పోలీస్ అధికారులు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలన్నారు. ఎక్కడ గబజాయి విక్రయం, సేవించనా సమాచారం తెలుసుకునేలా ప్రజలతో మమేకం కావాలని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయి కేసుల విషయంలో అరెస్టులు, సీజ్ చేయడంతో పాటు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గంజాయి రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడం కోసం ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పాన్ షాపులు, కిరాణా దుకాణాల తనిఖీతో పాటు వారితో సమావేశం నిర్వహించి గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాల కారణంగా ఎదురయ్యే అనర్ధాలు, చట్టపరంగా తీసుకునే చర్యల పట్ల అవగాహన కల్పించి వారిని చైతన్యం చేయాలన్నారు. గంజాయి అంశంలో ఎలాంటి రాజకీయ జోక్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గంజాయి విక్రయం, రవాణా, సేవిస్తున్న అంశాలను సులువుగా తీసుకోవద్దని, ఇది చాలా తీవ్రమైన సమస్యగా గుర్తించి అన్ని స్థాయిల పోలీస్ అధికారులు మరింత బాధ్యతాయుతంగా, సమర్ధంగా పని చేయాలని డిఐజి రంగనాధ్ చెప్పారు. కేసుల నమోదు, విచారణ, సెక్షన్లు, పాటించాల్సిన నిబంధనలు, కోర్టులో సమర్పించాల్సిన పత్రాలు, తదితర అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు పోలీస్ అదికారులకు అవగాహన కల్పించారు. *ఏ.వో.బి..ఆపరేషన్ అధికారులకు ప్రత్యేక అభినందన* గంజాయి ముఠాలను పట్టుకోవడం కోసం ఏ.వో.బి. ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి, ప్రాణాలకు సైతం తెగించి గంజాయి విక్రయదారులను తీసుకువచ్చేందుకు వెళ్లిన జిల్లా టాస్క్ ఫోర్స్, పోలీస్ బృందాలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో పాటు సమాజం పట్ల బాధ్యతతో అద్భుతమైన పనితీరు కనబర్చి నల్లగొండ జిల్లా పోలీసుల సత్తాను చాటారని ఆయన అభినందించారు. *సమర్ధంగా పనిచేసే అధికారులకు ప్రోత్సాహకాలు* గంజాయి విషయంలో సమర్ధవంతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిందని ఆయన తెలిపారు. యాక్సిలరీ పదోన్నతులతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు అందించనున్నదని ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర స్థాయిలో డి.జి. స్థాయి అధికారి నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం *నోడల్ ఏజెన్సీ* ఏర్పాటు చేయనున్నదని వివరించారు. సమావేశంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సురేష్ కుమార్, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, రౌతు గోపి, నాగరాజు, పి.ఎన్.డి. ప్రసాద్, శంకర్ రెడ్డి, మధు, శ్రీనివాస్, గౌరు నాయుడు, వెంకటేశ్వర్లు, సత్యం, రాఘవులు, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, ఎస్.ఐ.లు విజయ్ కుమార్, నాగరాజు, యాదయ్య, సుధీర్, నర్సింహా రావు, శివ కుమార్, నర్సింహా, రాజశేఖర్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...