*సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు 26 ఏప్రిల్ న 1,020భోజన ప్యాకెట్లు పంపిణీ*
*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారి ఆధ్వర్యంలోప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికె విఠల్ గారి పర్యవేక్షణలో డీసీపీ ఆఫీస్ ఎదురుగ, ఎల్.బి.నగర్, భరత్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, కోపరేట్ బ్యాంకు కాలనీ, నాగోల్ లో620 భోజన పాకెట్స్ పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో సహాయ కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పెద్ది శ్రీనివాస్ గారు మరియు శ్రీ చింతల బాలరాజ్ గారు పాల్గొన్నారు. ఎల్ బి నగర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది తో విచ్చేసి సోషల్ డిస్టెన్స్ తో పంపిణి చేయించారు.*
*సహాయ కార్యదర్శి శ్రీ మురళి గుప్త గారు 400 భోజన ప్యాకెట్లు మోజం జాహి మార్కెట్ మరియు నాంపల్లి ప్రాంతములో పంపిణి చేశారు.*