20 తర్వాత తెరిచేవి..నిషేధం కొనసాగేవి ఇవే..
కరోనా వ్యాప్తి నియంత్రణ, లాక్ డౌన్ తో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టు కుని కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వ్యవసాయం, ఐటీ, ఈ–కామర్స్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి ఇవ్వా లని నిర్ణయించింది. కరోనాఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు,గుర్తించి న మార్కెట్ల ద్వా రా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఏప్రిల్ 20 తర్వాత వేటికి పర్మిషన్ ఇచ్చారు.. వేటిపై నిషేదం ఉంటుందనేది ఒకసారి చూద్దాం.
లాక్డౌన్ నుంచి పూర్తిగా మినహాయింపు ఉన్నవి
హాస్పిటల్స్, నర్సింగ్హోమ్స్, క్లినిక్స్, టెలి మెడిసిన్స్, ఫార్మసీలు, ల్యాబ్లు, టెస్టింగ్ సెంటర్లు యధావిధిగా కొనసాగుతాయి. కరోనాపై రీసెర్చ్ చేస్తున్న ఫార్మాస్యుటికల్స్, మెడికల్ రీసెర్చ్ ల్యాబ్స్కు అనుమతి. డ్రగ్స్, ఫార్మాసుటికల్స్, మెడికల్ డివైజెస్, మెడికల్ ఆక్సిజన్, ప్యాకేజింగ్ మెటీరియల్, రా మెటీరియల్ తయారీ యూనిట్లకు ఓకే.
- కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్ సర్వీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనుల కొనసాగింపు.
- బ్యాంకుల కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయి. స్టాక్మార్కెట్లకు లాక్ డౌన్ వర్తించదు.
- అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి.
- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు యథాతథం.
- డెయిరీలు, మిల్క్ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ ఇండస్ట్రీ, టీ, కాఫీ, రబ్బర్ సాగు కొనసాగించవచ్చు.
మే 3 వరకు నిషేధం కొనసాగేవి
- సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, బార్లు
- స్కూళ్లు, కాలేజీలు, ట్రైనింగ్ సెంటర్లు కూడా క్లోజ్. షెడ్యూల్ ప్రకారం సిలబస్ను పూర్తి చేసేందుకు ఆన్లైన్ క్లాసులకు అనుమతి.
- ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, జైన్ మందిరాలు మూసే ఉంటాయి. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలకు అనుమతి లేదు.
- ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీల తరలింపుపై నిషేధం.
- లిక్కర్, గుట్కా, టొబాకో అమ్మకాలపై బ్యాన్ కఠినంగా అమలు.
- ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్, అన్ని ప్యాసింజర్ ట్రైన్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులు, మెట్రో సర్వీసులు, ట్యాక్సీలపై నిషేధం కొనసాగింపు.
మెడికల్ రీజన్స్ ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర సరిహద్దులు దాటే అవకాశం. - ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం స్టాఫ్ తో మాత్రమే పని చేసేందుకు అనుమతి..
20వ తేదీ తర్వాత తెరిచేవి
- హైవేలపై దాబాలు, మెకానిక్ షెడ్లు ఓపెన్ చేస్తారు.
- ఈ–కామర్స్ సంస్థల కార్యకలాపాలు, వాటి వాహనాలకు నిబంధనలకు లోబడి అనుమతి.
- ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, కార్పెంటర్లకు అనుమతి.
- గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టులు.
- భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు.
- పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి.
- కొరియర్ సర్వీసులకు ఓకే.
- లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వారి కోసం హోటల్స్, లాడ్జీలు, మోటల్స్, హోం స్టేకు అనుమతి.
- గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల శివార్లలో ఉండే పరిశ్రమలకు అనుమతి.
- వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం కోసం మార్కెట్లకు అనుమతి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే వ్యవసాయ మార్కెట్లకు మినహాయింపు.
- వ్యవసాయ పరికరాలు, విడిభాగాల షాపులు తెరిచేందుకు, వ్యవసాయ పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు ఓకే.
- విత్తనాల తయారీ, ఎరువులు, ఫెర్టిలైజర్ షాపులకు అనుమతి.
- ఆక్వా ప్రొడక్ట్స్ అమ్మకాలు, కొనుగోలుకు అనుమతి.
- సెజ్లు, ఎక్స్పోర్ట్కు సంబంధించిన యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ లో పరిశ్రమలు తెరవొచ్చు.
రూల్స్ పాటించకుంటే మినహాయింపులు కట్
‘‘లాక్డౌన్ మినహాయింపునకు సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ను స్ట్రిక్ట్గా అమలుచేయాలి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు గైడ్ లైన్స్ ను అనుసరించాలి. ఒకవేళ వీటిని ఉల్లంఘించినట్టు తేలితే లాక్ డౌన్ మినహాయింపులను వెంటనే రద్దు చేస్తాం..’’
– కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా