**తెలంగాణమెట్రో ప్రారంభోత్సవం ఏమైనా టీఆర్ఎస్ ఫంక్షనా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్**. తెలం
గాణమెట్రో ప్రారంభోత్సవం ఏమైనా టీఆర్ఎస్ ఫంక్షనా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారి.. పాతబస్తీకి మెట్రో రాకుండా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం దిల్కుషా గెస్ట్హౌస్లో మెట్రో రైలు అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నగరంలో పాతబస్తీ చాలా వెనుకబడి ఉందన్నారు. పాతబస్తీ అభివృద్ధిని కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మెట్రో రావడం వల్ల పాతబస్తీ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కై పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తయిందన్నారు. మెట్రోకు కేంద్రం రూ.1200 కోట్లు నిధులిచ్చిందని గుర్తుచేశారు. మరో రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఫలక్నూమా వరకు మెట్రో నిర్మాణం చేస్తామంటేనే కేంద్రం నిధులిచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైలు టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు
కేంద్రంపై విమర్శలు చేయటమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తుంది.. ఎన్ని ఇళ్లు కడతారో చెప్పండి అంటూ కేటీఆర్కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చినా తన వాటా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రెండోదశ పనులపైనా కేంద్ర మంత్రి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫలం వలనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావటంలేదన్నారు. ఎంఎంటీఎస్ రెండోదశను ఇప్పటికైనా పూర్తి చేయాలన్నారు.