ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు...*
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల
గారు 35 మంది బాధితులకి 17,21,000/--రూ.ల CMRF- ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులని పంపిణీ చేశారు.
*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...*
*ప్రజా సంక్షేమమే ప్రభుత్వ మొదటి కర్తవ్యం..*
*CMRF తో మెరుగైన వైద్యం..*
*నిరు పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..*
గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారథ్యం లోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రి లలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము.
గర్భిణీ స్త్రీ లకు సాధారణ ప్రసవాలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
అత్యవసర సమయాల్లో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాము.
నిజామాబాద్ నగర ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రయివేటు హాస్పటల్ లో చికిత్స పొందితే సంబందీత బిల్లులతో మా కార్యాలయంలో CMRF దరఖాస్తు చేసుకొంటే వీలయినంత సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తాము.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్,సత్య ప్రకాష్ మరియు BRS కార్పొరేటర్ లు,నాయకులు పాల్గొన్నారు.