నల్గొండ జిల్లా: నల్గొండలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
గారు
* కేసీఆర్ ఇస్తానన్న ముస్లిం రిజర్వేషన్ ఏమైంది?
* గజ్వేల్ లో ఇళ్లు కట్టించిన కేసీఆర్.. నల్గొండలో ఎందుకు కట్టలేదు
* బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాలుగున్నర నెలల సమయమే ఉంది
* రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
* మా హయాంలో వంటగ్యాస్ ను రూ.500 కే అందిస్తాం
* భట్టి విక్రమార్క గారి పాదయాత్రలో భాగంగా నల్గొండలో భారీ సభ నిర్వహిస్తాం..
* నల్గొండ సభకు ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానించాం.. ఆమె వస్తానన్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు
- అందరూ బాగుండాలని ఉపవాస దీక్ష చేసే పండుగ రంజాన్
- సచార్ కమిటీ నివేదిక ప్రకారం.. ముస్లింలలో 98 శాతం పేదవాళ్లు ఉన్నారని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చాం..
- సుప్రీంకోర్టు ఒప్పుకోకుంటే రిజర్వేషన్ కోసం పోరాడి సాధిచుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.
- 12 శాతం రిజర్వేషన్ చేస్తానని కేసీఆర్ అన్నారు. ఇంతవరకు చేయలేదు. 9 ఏళ్లు గడిచిపోయాయి.. ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. కనీసం 8 శాతానికి కూడా పెంచలేదు. తమిళనాడులో మాదిరిగా పెంచే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
- నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు.
- నా హయాంలో నల్గొండ ఈద్గా దగ్గరలో రాజీవ్ గృహకల్ప కింద 300 ఇళ్లు కట్టించాను.
- ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. సొంత జాగా ఉంటే లక్ష రూపాయలు ఇచ్చాం.. కానీ, డబుల్ బెడ్రూం అని చెప్పిన కేసీఆర్ నల్గొండలో దళితులు, ముస్లింలు, పేదవాళ్లను మోసం చేశారు. దత్తత అని చెప్పి ఏం చేశారు.
- గజ్వేల్ లో 5వేల ఇళ్లు కట్టించిన కేసీఆర్.. నల్గొండలో ఎందుకు కట్టలేదు. ఎమ్మెల్యే తండ్రి చనిపోతే వచ్చి మెయిన్ రోడ్ ఒక్కటి వేస్తే సరిపోతుందా? ఆ ఒక్క రోడ్ తో నల్గొండ అభివృద్ధి కాదు. పేదలకు ఇళ్లు కట్టినప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతుంది.
- మూడున్నర లక్షల మంది విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నారు. దాని గురించి కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఉర్దూ మీడియంలో సెలెక్షన్స్ లేవు.
- నాలుగున్నర నెలల సమయమే ఉంది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. గతంలో సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి లక్ష రూపాయలు ఎలా ఇచ్చామో.. ఈసారి 5 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నాం.
- భువనగిరికి ఎంపీనే అయినా.. నల్గొండలో ఎవరికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటున్నా.. నల్గొండ నుంచి ఈసారి కోమటిరెడ్డి పోటా చేస్తారా? లేదా? అనే వార్తలు వస్తున్నాయి. మీకు డౌట్ అవసరం లేదు. ఆరు నెలల క్రితమే క్లారిటీ ఇచ్చాను. నల్గొండ నుంచి ముమ్మాటికీ పోటా చేస్తాను. తెలంగాణలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉంది.
- ఎన్నో ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రజలకు సంతోషమున్నా, దు:ఖమున్నా వారికి నేనున్నాననే భరోసా కల్పిస్తున్నా.
- మీడియాలో తప్పుడు కథనాలు రాయొద్దు. నల్గొండ నుంచి నేను పోటీ చేయడం ఖాయం. ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రజలు నాకు తోడున్నారు. ఓసారి ఇప్పుడున్న నాయకులు చేసింది.. నేను చేసింది గుర్తు చేసుకోండి.
- సరైన బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే.. 15 లక్షలు ఖర్చు చేసి కట్టించాను. నేను ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు మంచి చేయాలనేదే నా తాపత్రయం.
- ముస్లిం మతపెద్దలు మౌలానా గారు ఇల్లు కాలిపోతే.. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు విషయం తెలిసి వెంటనే వచ్చాను. ఇవన్నీ ఓట్ల కోసం కాదు. పేదలు బాగుండాలన్నదే నా గుణం.
- దేశంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రధాని మోడీ ఇంటికో ఉద్యోమన్నారు. 15 లక్షలు ఇస్తానన్నారు. ఎక్కడా ఉద్యోగాలు లేవు.. 15 లక్షలు ఇచ్చింది లేదు. వంట గ్యాస్ మాత్రం 15 వందలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తాం.
- భట్టి విక్రమార్క గారు చేస్తున్న పాదయాత్ర భువనగిరి నియోజకవర్గం, అలాగే నల్గొండ మీదుగా ఖమ్మం వెళ్తుంది. నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ఈ సభకు ప్రియాంక గాంధీ గారిని తీసుకురావాలని చూస్తున్నాం. ఈ విషయాన్ని ఆమెకు చెప్పాం. సానుకూలంగానే మాట్లాడారు. నల్గొండలో ప్రియాంక గాంధీ గారితో సభ ఉంటుంది.