నివారణే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ లు* .
*--568 వాహనాల పైన కేసు నమోదు* ..
*--మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే కఠిన చర్యలు*
*--బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే చర్యలు తప్పవు* ..
*జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు
ఐ.పి.యస్.*
జిల్లా పోలీస్ కార్యాలయం లో యస్.పి గారు మాట్లాడుతూ ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని, ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సరియైన పత్రాలు,రాంగ్ డ్రైవింగ్, నో హెల్మెట్,ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నో పార్కింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్, విత్ ఔట్ సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి వాటిపై టు విల్లర్స్ వాహనాలు 388, త్రి విల్లర్ వాహనాలు 14, ఫోర్ విల్లర్స్ వాహనాలు 114, ఇతర వాహనాలు 52 *మొత్తం 568 వాహనాలు పైన కేసు నమోదు చేసి 204200 రూపాయల పైన్ వేయడం జరిగింది అని అన్నారు* . వాహన దారులు వాహనానికి సంబందించిన సరియైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత,ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్&డ్రైవ్ నిర్వహిస్తామని తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని అన్నారు.మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో,పబ్లిక్ ప్లేస్ లలో మద్యం తాగితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.