సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో బాగంగా నేడు జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు అమరవీరుల త్యాగాలను, స్మరిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి చర్లపల్లి బై పాస్ వరకు 12 th బెటాలియన్ సిబ్బంది జిల్లా పోలీస్ సిబ్బంది సంయుక్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి,దేవరకొండ డిఎస్పీ కార్యాలయం, మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్, నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లలో జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పాఠశాలల విద్యార్దిని,విద్యార్థులకు పోలీస్ సిబ్బంది నిర్వహించే విధులు, విది నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు,బాంబ్ డిటెక్టర్ పరికరాలు, పోలీస్ డాగ్స్ వాటి పనీతీరును గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి.యస్.పి సురేష్ కుమార్,ఆర్. ఐ లు హరిబాబు,శ్రీనివాస్,సంతోష్,యస్. ఐ రాజశేఖరరెడ్డి, ఆర్.యస్. ఐ లు కళ్యాణ్ రాజ్, రాజీవ్, అఖిల్, రాహుల్, సాయిరాం, మమత, సిబ్బంది, విద్యార్దిని,విద్యార్దులు పాల్గొన్నారు.