*నల్లగొండ జిల్లా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్*
ముందుగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య గారు మరణించిన సమయంలో కరోనా కారణంగా రాలేకపోయాను
అందుకు తాను సంతాపం వ్యక్తం చేశారు.. అనంతరం మీడియా సమావేశoనిర్వహించారు.తర్వాత స్థానిక జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను కలిసి నల్లగొండ జిల్లా సమస్యలపై పలుఅభివృద్ధి పనుల పై విస్తృతంగా చర్చించి వినతి పత్రాలు అందజేశారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది...
*ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్*
👉నల్లగొండలో తన హయాంలో జరిగిన అభివృద్ధే తప్పా ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు
👉నల్లగొండ ను దత్తత విషయం కేసీఆర్ కి మూడేళ్ల తర్వాత గుర్తొచ్చిందా
👉దత్తత తీసుకున్న వ్యక్తి ముప్పై ఆరు నెలల తర్వాత వస్తారా
👉దత్తత తీసుకుంటానని మాయ మాటలు చెప్పడంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.
👉కేసీఆర్ మాటలు విని నల్లగొండ ప్రజలు మోసపోయారు
👉చింతమడకలో ఇంటికి పది ఇచ్చారు
👉నల్లగొండలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ఇంత వరకు చేపట్టలేదు
👉సీఎం వస్తున్నారంటే ఆయన జిల్లాలో నిర్మించినట్లు మెడికల్ కాలేజీ నిర్మిస్తారని అనుకున్నా
👉ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తారని అనుకున్నాం కానీ అవేవి లేవు
👉యాభై కోట్లు కేటాయిస్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి అవుతుంది.
👉ఉదయ సముద్రం పూర్తైతే అరవై వేల ఎకరాలకు నీరందుతుంది. అయినా కెటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
👉వానాకాలంలో వరి అమ్ముకోవడం కోసం రెండు మూడు నెలలు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు
👉ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు రైతులకి అందలేదు
👉వరి కొనుగోలు చేయమని అంటున్నారు. ఎలా కొనరో ఆయన సంగతి మేం చూస్తాం
👉ఎన్జీ కాలేజ్ నేను కట్టిస్తా అని అనడంతో కాలేజీకి నిధులు కేటాయించారు.
👉అభివృద్ధికి సహకరిస్తాం, రోడ్డు వెడల్పుతో నష్టపోయేవారికి సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే ఊరుకోం
👉సిద్దిపేటలో ఏవిధంగా ఇచ్చారో ఇక్కడా పరిహారం అదేవిధంగా అందజేయాలి
👉ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా సబ్ స్టేషన్లను నిర్మించిన
👉గాదరి మారయ్య కారణంగా ముప్పై ఆరు నెలల తర్వాత కేసీఆర్ నల్లగొండకి వచ్చారు
👉రిటైర్ అయిన మున్సిపల్ కమీషనర్ ని ఇక్కడకు తీసుకొచ్చారు
👉ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం కూడా ఉండటం లేదు.