సూర్యాపేట : బండి సంజయ్
: కామెంట్స్.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. మా పై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఎలా. ఖచ్చితంగా వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదు. ఎనిమిది రాష్ట్రాల్లో లేని సమస్యలు ఇక్కడే ఎందుకు. కొనుగోళ్ల తంతులో అన్నింటీకీ మేమే డబ్బులు ఇస్తున్నాం. 2022 వరకు రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలను నిలబెట్టుకుంటాం. పథకం ప్రకారం రైతులను సతాయించి ఇబ్బందులు పెట్టి కొనుగోలు చేయాలని చూస్తోంది. రుణమాఫీ చేస్తామని చేయలేదు, ఫసల్ భీమా యోజన ఎందుకు అమలు చేయలేదు. కేసీఆర్ సన్న ధాన్యం వద్దని ఫామ్ హౌస్ లో దొడ్డు ధాన్యం వేసుకున్నారు. కాళ్ళు మొక్కిన కలెక్టర్ ను ఎమ్మెల్సీ చేస్తున్నారు.. ప్రజలు,రైతులకు ఇబ్బందులు పెట్టిన వారికి పదవులా..? బీజేపీ ప్రశ్నించకుంటే ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభం కాకపోయేవి. మావి ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసుల బందోబస్తు, వారి సహకారంతో దాడులు చేస్తున్నారు. మాపై దాడికి స్కెచ్ వేసినప్పుడే నిన్నటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అవినీతి చిట్టా తీస్తాం, తప్పకుండా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాము.