బేబి ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన సమాచార హక్కు వికాస సమితి .

 ప్రతి చంటి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కోసం తల్లిపాలు ఎంతో అత్యవసరమైనవని. వాటిని ప్రతి చంటి బిడ్డలకు అందించే క్రమంలో ప్రయాణికుల రద్దీ ఉన్న సమయంలో తల్లులు పడే ఇబ్బందులు తొలగించే విదంగా బేబి ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన సమాచార హక్కు వికాస సమితి సేవలు అభినందనీయమని జిల్లా రెవిన్యూ అధికారి యన్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బేబి ఫీడింగ్ రూమ్ ను నల్గొండ బస్ స్టేషన్ లో ప్రారంభించి మాట్లాడినారు. . చంటి పిల్లల తల్లులు ప్రయాణం చేయుచున్న సమయంలో బస్ స్టేషన్ నందు తల్లులు పడే ఇబ్బందులు తొలగి, సౌకర్యవంతంగా ఉండేలా రూమ్ ను ఏర్పాటు చేసిన వారికి ఆర్థిక సహకారం అందించిన శ్రీ విజయందేర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ యజమాని కత్తి కనకల్ రెడ్డి గారిని DMHO అన్నీమల్ల కొండల్ రావు అభినందించారు. తల్లి పాలవల్ల బిడ్డలకు కలిగే లాభాలను DMHO గారు వివరించారు..బస్ స్టేషన్ లో ఈ రూమ్ ఏర్పాటుకు RTC MD సజ్జనార్ గారి అదేశాలమేరకురీజనల్ మేనేజర్ కె రాజేంద్ర ప్రసాద్, డిపో మేనేజర్ TRC మూర్తి గార్లు అనుమతించి నందుకు వారికి సమాచార హక్కు వికాస సమితి తరపున వ్యవస్థాపకులు డాక్టర్ యర్రమాధ కృష్ణా రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TSRTC PO సుజాత, గందమల్ల జయంత్, యల్లా చంద్రారెడ్డి. జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శి పొట్టేపక యాదయ్య. ఉపాధ్యక్షులు బొక్కు శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీనివాస్, P చంద్రశేఖర్ రెడ్డి. కోట్ల మదుకర్ రెడ్డి, కొత్తపల్లి కరుణ్ కుమార్, రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి CH విద్యా సాగర్, వై. హేమలత, సింగం లక్ష్మీ, కుప్పల క్రాంతి. చింతకాయల నర్సింహ, మిర్యాల కిరణ్ కుమార్, బీమానపల్లి గణేష్, సైదులు నర్శింగరావు. గురుమూర్తి.. గంటకంపు గణేష్, RTC కంట్రోలర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...