హైదరాబాద్: VBG-ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన భోజనాల  కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని  VBG ఫౌండర్ యం. రాజు  తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆలేరు లోని భువన సూర్య రిసార్ట్స్లో దాదాపు పదివేల మందితో VBG  ఫౌండేషన్  ఆధ్వర్యంలో  వన భోజనాల కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి జంటనగరాల్లోని నలుమూలల నుండి ఉచిత బస్సు సౌకర్యము అందజేయడం జరుగుతుందని,  మరియు వివిధ జిల్లాల నుండి కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇది మా వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించి మీరు తప్పకుండా సకుటుంబ సపరివార సమేతంగా రాగలరని మనవి చేశారు.