తిరుమలలో.. వెంకన్న దివ్య సన్నిధిలో.. వేదపండితుల ఆశిస్సులతో.. వీబీజీ ఫౌండేషన్ మొదటి బోర్డు సమావేశం

 తిరుమలలో.. వెంకన్న దివ్య సన్నిధిలో.. వేదపండితుల ఆశిస్సులతో.. వీబీజీ ఫౌండేషన్ మొదటి బోర్డు సమావేశం.. ---------------------------- ఆపన్నులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రారంభించిన వీబీజీ ఫౌండేషన్ బోర్డు మీటింగ్ ఓం ప్రధమంగా తిరుమలలో నిర్వహించారు. ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ పడిపడగ రాము గారు, వైస్ ఛైర్మన్ శ్రీ తాటిపల్లి శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ ఇమ్మడి రమేశ్ గారు మరియు వీబీజీ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ TSV ప్రసాద్ గారు, ఫౌండర్ శ్రీ M.రాజు గారు ఉదయమే శ్రీవారి సేవలో పాల్గొన్నారు.. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆ తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్ తిరుమలలో నిర్వహించారు.. ఆపదలో ఎవరున్నా.. సాయం కోసం ఎవరు అర్థించినా కాదనకుండా సాయం చేయాలని తీర్మానించారు. భగవత్ సేవతో మొదలు పెట్టిన ఈ సేవాకార్యక్రమం ప్రపంచ దేశాలకు విస్తరించాలని..మానవత్వం పరిమళించాలని వారు సంకల్పం చేసుకోవడం విశేషం.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...