జాతీయ ఓటరు దినోత్సవం పై అవగాహన కల్పించాలి : ఇంచార్జి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్





నల్గొండ,జనవరి 18.ఈ నెల 25 న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్ అవగాహన కు వివిధ కార్య్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో జాతీయ ఓటర్ దినోత్సవం పై వివిధ శాఖ ల అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు జారీ చేశారు.25  న ఎన్.జి.కళాశాల లో జాతీయ ఓటర్ దినోత్సవం సమావేశం,ఉదయం 9 గంటలకు విద్యా ర్థుల చే క్లాక్ టవర్ నుంచి ఎన్.జి.కళాశాల వరకు ర్యాలీ నిర్వహణ కు ఏర్పాట్లు చేయాలని అర్.డి.ఓ.,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి,ఎన్.జి.కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళా కారులచే సాంస్కృతిక కార్య్రమాలు ఏర్పాటు చేయాలని డి.పి.అర్.ఓ. ను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,అర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,డి.పి.అర్.ఓ.శ్రీనివాస్,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భాను నాయక్,గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి గూడ వెంకటేశ్వర్లు,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు






Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...