గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు

 గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు


IPS*

 *--బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం.* 

 

         ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 25 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ రోజు వచ్చిన పిర్యాదులు భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు,ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు పైన పిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని,ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తూన్న  వారి  మాటలు నమ్మి  మోసపోవద్దని సూచించారు.  ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...