మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి భూమి పూజ చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు.
...
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు కంటేశ్వర్ బైపాస్ రోడ్డు లో 50 లక్షల రూ.తో నిర్మిస్తున్న మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ....
నిజామాబాద్ నగరం ప్రతి కులానికి,ప్రతి మతానికి సామాజిక కార్యక్రమలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ హల్ లని నిర్మించడం జరిగింది.
మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు విన్నపం మేరకు 50 లక్షల రూ. లను మంజూరు చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది.
సాధ్యమైన త్వరలో భావనాన్ని నిర్మించుకోవాలని కోరుతూ మీకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని తెలియచేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,TNGOs జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ గారు,దండు శేఖర్,SC సెల్ అధ్యక్షుడు నీలగిరి రాజు మరియు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.