8 వేల లంచం తో ఎసిబి కి చిక్కిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్



హైదరాబాద్:
బహదూర్‌పురా పోలీస్ స్టేషన్,   ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్  అర్.శ్రవణ్ కుమార్ రూ.8,000/-లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి ఫిర్యాదుదారు శ్రీ ఎండీ ముజీబ్ నుండి  స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా  ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు దారు కొడుకు పై ఆరోపించబడ్డ చీటింగ్ కేసు తప్పించడానికి మరియు అతని సెల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశాడు. స్వీకరించిన లంచం మొత్తం రూ.8,000/- లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యొక్క కుడి చేతి వేళ్లు రసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని ఇచ్చాయని ఎసిబి తెలిపింది. నిందితుడు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్.శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఎసిబి కేసుల కోర్టు జడ్జి ముందు హాజరు పరిచామని, కేసు విచారణ జరుగుతుందని ఎసిబి అధికారులు తెలిపారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...