ప్రజలు డిశంబర్ 31 వేడుకల్లో శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి.*


**జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు* 

**ప్రజలు డిశంబర్ 31 వేడుకల్లో శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి.* 

* *31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.* 

* *డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం జరుగుతుంది* .

 *జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ పి యస్.* 

 జిల్లా పోలీస్ కార్యాలయం యస్.పి గారూ మాట్లాడుతూ  జిల్లాలోని ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని, తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ

      డిశంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలి, వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలి.


మద్యం దుకాణాలు, వైన్ షాప్స్, బార్స్, రెస్టారెంట్స్ ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలి.

 31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము మద్యం మత్తులో వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులొకి  తీసుకుని జరిమానా, వాహనం సీజ్ చేయడం, లైసెన్స్ రద్దు చేయడం, బైయిండోవర్ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.ఎందుకనగా ప్రజల యొక్క అమూల్యమైన జీవితం నాశనం చేసుకోకుండా పోలీస్ వారి బాధ్యత.

ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవు. 

మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తో  అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ,ఇబ్బందులను పెట్టే వారిపై ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.

ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.

ముఖ్యంగా యువత పై కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రబుత్వ ఉద్యోగాలు,ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవు కావున యువత గమనించగలరు 

మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్,  మఫ్టీ టీమ్స్, ముఖ్యమైన కూడలిలలో  CC కెమరాలు ఏర్పాటు లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. 

ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలి.

31 డిసెంబర్ పోగ్రాం అర్గానైస్ చేసేవాళ్ళు మరియు దుకాణా యజమనుదారులు పుడ్ మరియు డ్రింక్స్ కు  వినియోగదారుల నుండి ఎక్కువగా వసూళ్ళు చేస్తూ ప్రజలను మోసం చేయరాదు .

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...